రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్, స్టాండ్ ఇన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉన్నాడు! కోలక్తా నైట్ రైడర్స్తో నేడు(ఏప్రిల్ 26) జరిగే మ్యాచులో ఆ జట్టు స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేస్తే.. కెప్టెన్గా కోహ్లీపై నిషేధం పడే ఛాన్స్ ఉంది. అతడు ఓ మ్యాచ్ ఆడకుండా ఉండాల్సి వస్తుంది. అలాగే రూ. 30 లక్షల జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. దీంతోపాటే ఇంపాక్ట్ ప్లేయర్తో పాటు టీమ్లోని మిగతా ఆటగాళ్లంతా రూ. 12 లక్షల ఫైన్ లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతను.. ఏదో ఒకటి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే నిర్దిష్ట సమయంలో(90 నిమిషాల్లో) తమ కోటా ఓవర్లను పూర్తి చేస్తే.. ఆర్సీబీ ఈ పనిష్మెంట్ నుంచి తప్పించుకుంటుంది. లేదంటే దీని ప్రభావం జట్టుతో పాటు కోహ్లీపై పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ జట్టు కెప్టెన్గా డుప్లెసిస్ ఉన్నా అతడికి కూడా ఇదే వర్తిస్తుంది. మరి ఏం జరుగుతుంతో చూడాలి..
స్లో ఓవర్ రేట్ రూల్స్ ప్రకారం.. బౌలింగ్ చేసే టీమ్.. నిర్దిష్ట సమయంలో 20 ఓవర్లు పూర్తి చేయాలి. లేదంటే తొలిసారి జట్టు కెప్టెన్కు రూ.12 లక్షల జరిమానా విధిస్తారు. రెండో సారి ఇదే తప్పు కొనసాగిస్తే.. కెప్టెన్కు రూ. 24 లక్షలు, టీమ్ ప్లేయర్స్కు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజ్లో 25 శాతం కోత.. అదే మూడోసారి జరిగినే కెప్టెన్కు రూ.30 లక్షలతో పాటు ఒక మ్యాచ్ నిషేధం, జట్టు సభ్యులకు రూ.12 లక్షల ఫైన్ లేదా మ్యాచ్ ఫీజ్లో 50 శాతం కోత విధిస్తారు.