ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా గత నాలుగు మ్యాచులు కూడా ఎంతో ఉత్కంఠగా సాగాయి. తాజాగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ విషయంలో కూడా అదే జరిగింది. థ్రిల్లింగ్ ముగింపును ఇస్తూ అభిమానులకు మస్త్ మజానిచ్చింది. ఆఖరి బంతి వరకు దోబూచులాడిన విజయం.. చివరికి సందీప్ శర్మ అద్భుతమైన బౌలింగ్ వల్ల 3 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్కే వరించింది. అలా తాజా సీజన్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట విజయం సాధించిన రాయల్స్ టీమ్.. పాయింట్ల పట్టికలో టాపర్గా నిలిచింది.
అయితే గెలుపు జోషల్లో ఉన్న రాజస్థాన్కు ఇప్పుడు ఓ ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్రేట్ కారణంగా ఆ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్కు జరిమానా విధించారు ఐపీఎల్ అధికారులు. రూ.12 లక్షలు ఫైన్ వేశారు. ఈ సీజన్లో రాయల్స్ చేసిన తొలి తప్పిదం కారణం కేవలం రూ.12 లక్షల రూపాయల జరిమానా మాత్రమే పడింది. రెండో సారి ఇదే తప్పు కొనసాగితే.. సంజూ ఒక్క మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారు. కాగా, తాజా సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తర్వాత.. ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన రెండో కెప్టెన్గా శాంసన్ నిలిచాడు. ఇకపోతే ఐపీఎల్లో స్లో ఓవర్రేట్ కారణంగా శాంసన్కు ఫైన్ విధించడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు కూడా గత సీజన్(2021)లో రెండు సార్లు అతడిపై జరిమానా విధించారు.