తెలంగాణ

telangana

IPL 2022: ఆర్సీబీ గెలుపు.. ప్లేఆఫ్స్​ నుంచి చెన్నై ఔట్!

By

Published : May 4, 2022, 11:05 PM IST

Updated : May 4, 2022, 11:15 PM IST

IPL 2022: చెన్నై సూపర్​కింగ్స్​పై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైని 160/8 పరుగులకే ఆర్సీబీ కట్టడిచేసింది.

csk vs rcb
IPL 2022

IPL 2022: ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్‌లో చెన్నైపై బెంగళూరు జట్టు విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ధోనీ సేన ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 122 పరుగుల వరకు చెన్నై ఇన్నింగ్స్‌ నిలకడగానే సాగినప్పటికీ అనంతరం స్వల్ప వ్యవధిలోనే కీలక వికెట్లు పడ్డాయి. దీంతో ఆజట్టుపై ఒత్తిడి పెరిగిపోయి చేతులత్తేసింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. 11 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్‌ సేన 6 మ్యాచుల్లో నెగ్గింది. ఇక మిగతా మూడు మ్యాచుల్లో కనీసం రెండు గెలిస్తేనే బెంగళూరుకు ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉంటాయి. మరోవైపు చెన్నై ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా ముగిసినట్లే. చెన్నై జట్టులో డెవాన్‌ కాన్వే(56), మొయిన్‌ అలీ (34) రాణించారు. బెంగళూరు జట్టులో హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లు తీయగా, మాక్స్‌వెల్‌ 2 వికెట్లు తీశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు సమష్టిగా రాణించించడంతో 173 పరుగులు చేయగలిగింది. మొదట కెప్టెన్‌ కెప్టెన్‌ డుప్లెసిస్‌ (38), విరాట్ కోహ్లీ (30) ధాటిగా ఆడారు. లామ్రోర్‌ (42), రజత్‌ పటిదార్‌ (21) నెమ్మదిగా ఆడుతూ వికెట్లు కాపాడుకున్నారు. ఆ తర్వాత దినేశ్‌ కార్తీక్‌ మెరుపులతో డుప్లెసిస్‌ సేన 173 పరుగులు చేసింది.

ఇదీ చూడండి:'కోహ్లీ.. ఫామ్‌ సంగతి పక్కన పెట్టి మరో ఇద్దరు పిల్లలను కను'

Last Updated :May 4, 2022, 11:15 PM IST

ABOUT THE AUTHOR

...view details