ముంబయి ఆల్రౌండర్ హార్థిక్ పాండ్య, బెంగుళూరు ఆటగాడు క్రిస్ మోరిస్లను ఐపీఎల్ కమిటీ హెచ్చరించింది. టోర్నీ నిబంధనలను ఉల్లంఘించి, మితిమీరి ప్రవర్తించారని తెలిపింది.
'ఆర్సీబీ ఆల్రౌండర్ క్రిస్ మోరిస్.. లెవల్ 1 అతిక్రమణలో 2.5 నిబంధనను ఉల్లంఘించారు' అని ఐపీఎల్ కమిటీ తెలియజేసింది. ముంబయి ఆల్రౌండర్ హార్థిక్ పాండ్య లెవల్ 1 అతిక్రమణలో 2.20 నిబంధనను ఉల్లంఘించినట్లు పేర్కొంది.