తెలంగాణ

telangana

కోహ్లీ ఒంటరి పోరాటం.. భారత్ 223 ఆలౌట్

By

Published : Jan 11, 2022, 8:48 PM IST

Updated : Jan 11, 2022, 9:03 PM IST

IND vs SA
భారత్ ()

IND vs SA 3rd Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటలో టీమ్​ఇండియా విఫలమైంది. కోహ్లీ, పుజారా మినహా ఎవ్వరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో 223 పరుగులు వద్ద ఆలౌటైంది భారత జట్టు.

IND vs SA 3rd Test: కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ కష్టాల్లో పడింది. తొలి రోజు మొదటి సెషన్​ ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయిన భారత జట్టు మూడో సెషన్​ ముగియకముందే ఆలౌటైంది. విరాట్​ కోహ్లీ(79) ఒంటరి పోరాటం చేయగా.. పుజారా(43), పంత్(27) ఫర్వాలేదనిపించారు. రహానే(9), అశ్విన్(2), శార్దూల్ ఠాకూర్(12) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 77 ఓవర్లలో 223 పరుగులు చేసింది భారత్.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసొ రబాడ(4), మార్కో జాన్సన్(3) వికెట్లు పడగొట్టి భారత్ బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. ఒలివర్, ఎంగిడి, మహారాజ్ తలో వికెట్ తీశారు.

తొలి ఇన్నింగ్స్​లో 223 పరుగులు లక్ష్యంగా బరిలోకి దిగింది దక్షిణాఫ్రికా. క్రీజులో మార్​క్రామ్, డీన్ ఎల్గర్ ఉన్నారు.

Last Updated :Jan 11, 2022, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details