'ఎవరి మంత్రం ఫలిస్తుంది?' అంటూ ఆకర్షణీయమైన ప్రోమో విడుదల చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ ప్రోమోలో రెండు విభిన్నమైన లుక్స్లో కనిపించిన ధోనీ.. ఐపీఎల్ 2021పై అంచనాలు పెంచేస్తున్నాడు.
కోపంతో ఎన్నో జట్లపై అధిపత్యం సాధించిన కోహ్లీ మంత్రం ఈ ఐపీఎల్లో ఫలిస్తుందో లేదో చూడాలంటే.. ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే వివో ఐపీఎల్ కోసం వేచిచూడాల్సిందేనని అభిమానులను ఊరించాడు ధోనీ.