సెప్టంబర్ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని లీగ్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. దీంతో క్రికెట్ అభిమానులు సంతోషంలో మునుగి తేలుతున్నారు. కరోనా కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన క్రికెటర్లు మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నారు. తమ అభిమాన ఆటగాళ్ల ఆట కోసం ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందులో దృష్టంతా ధోనీపైనే.
గతేడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత ఆటకు దూరయ్యాడు మహీ. దీంతో అతడి రాక కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అభిమానులే కాక సహ ఆటగాళ్లు, మాజీలు, క్రీడాకారులు మహీ ఎప్పుడు మైదానంలో దిగుతాడా అని చూస్తున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ ఆటగాడు శ్రీకాంత్ కూడా ధోనీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.