బస్సులో దొంగలు..రెండు చోరీలు..
శుభకార్యానికి బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు కాగజ్నగర్ ప్రయాణ ప్రాంగణంలో ఓ మహిళ చేతిసంచిలో నుంచి 4 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ చోరీ జరిగిన కాసేపటికే మరో మహిళ పర్సు నుంచి 20వేల రూపాయలు దొంగిలించారు.
కుమురంభీం కాగజ్నగర్ బస్టాండ్లో వరస చోరీలు జరిగాయి. శుభకార్యానికి వెళ్లి తిరిగి ప్రయాణమైన షేక్ హఫిజా మంచిర్యాలకు వెళ్లే బస్సు ఎక్కింది. టికెట్ తీసుకుని సీట్లో కూర్చున్నాక చేతి సంచి తెరిచి చూసేసరికి అందులో ఉన్న 4 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గమనించింది. ఈ సంఘటన జరిగిన కాసేపటికే మంచిర్యాల ప్రయాణమవుతున్న మరో వ్యక్తి తన భార్య పర్సు కూడా పోయిందని ఆర్టీసీ డ్రైవర్కు సమాచారం ఇచ్చాడు. డ్రైవర్ బస్సు ఆపి పోలీసులకు సమాచారం అందించగా... సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి : 'ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన'
tg_adb_30_23_kzr_bus_stand_chori_av_ts10034
Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం ప్రయాణ ప్రాంగణంలో చోరీ జరిగింది. శుభకార్యానికి బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళుతున్న మహిళ చేతి సంచిలోంచి 4తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు దుండగులు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా ఐబీ తాండూరు గ్రామానికి చెందిన షేక్ హఫిజా బేగం కాగజ్ నగర్ పట్టణంలోని బంధువుల ఇంటికి శుభకార్యం నిమిత్తం నిన్న వచ్చారు. ఈ రోజు ఉదయం 11గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమయ్యారు. కాగజ్ నగర్ ప్రయాణ ప్రాంగణంలో కిక్కిరిసిగా ఉన్న మంచిర్యాలకు వెళ్లే బస్ ఎక్కారు. సీట్లలో కూర్చున్నాక చేతి సంచి తెరిచి ఉండటం గమనించిన బాధితురాలు సంచిలో ఉంచిన 4తులాల బంగారు ఆభరణాల కోసం వెతికింది. ఆభరణాలు కనిపించక పోవడంతో చోరీకి గురైనట్లు తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. ఈ చోరీ జరిగిన కాసేపటికే మంచిర్యాల ప్రయణమవుతున్న తన భార్య యొక్క పర్స్ కూడా పోయిందని గాదం ప్రభాకర్ అనే ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగజ్ నగర్ నుండి మంచిర్యాల వెళుతున్న తన భార్య గాదం రాజేశ్వరి వద్ద గల పర్స్ లో 20000 రూపాయల విలువగల చరవాణి పోయిందని తెలిపారు.
Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201