తెలంగాణ

telangana

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

By

Published : Oct 6, 2020, 5:09 PM IST

పదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా మన్ననూరు బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఎందుకు ఆత్మహత్యకు యత్నించిందో తమకు తెలియదని విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని (16) శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. తమ కుమార్తె బాగా చదువుకోవాలని సెప్టెంబర్​ 28న హాస్టల్​కు పంపామని తల్లిదండ్రులు తెలిపారు. బాలిక ఎందుకు ఆత్మహత్యకు యత్నించిందో తమకు తెలియదని.. పాఠశాల సిబ్బందే కారణమని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థినికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలని చూస్తున్నారని.. అది ఇష్టం లేక శానిటైజర్​ తాగిందని పాఠశాల ప్రిన్సిపాల్​ తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చికిత్స నిమిత్తం విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. అమ్రాబాద్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కాపాడిన లారీ డ్రైవర్

ABOUT THE AUTHOR

...view details