తెలంగాణ

telangana

పెళ్లింట్లో విషాదం.. ట్రాక్టర్​ బోల్తాపడి ముగ్గురు దుర్మరణం

By

Published : Dec 17, 2020, 7:31 AM IST

Updated : Dec 17, 2020, 10:47 AM IST

పెళ్లింట్లో విషాదం.. ట్రాక్టర్​ బోల్తాపడి ముగ్గురు దుర్మరణం
పెళ్లింట్లో విషాదం.. ట్రాక్టర్​ బోల్తాపడి ముగ్గురు దుర్మరణం

07:25 December 17

పెళ్లింట్లో విషాదం.. ట్రాక్టర్​ బోల్తాపడి ముగ్గురు దుర్మరణం

పెళ్లింట్లో విషాదం.. ట్రాక్టర్​ బోల్తాపడి ముగ్గురు దుర్మరణం

మరికాసేపట్లో పెళ్లి. బంధువులు, స్నేహితులతో ఇళ్లంతా సందడి సందడిగా ఉంది. పెళ్లి వారు వచ్చారు అనే మాట వినిపించాల్సిన చోట.. ప్రమాదం జరిగిందనే వార్త అందర్ని ఉలిక్కిపడేలా చేసింది. వివాహం జరుగుతున్న ఇంటికి నీటిని తీసుకెళ్తున్న ట్రాక్టర్​ బోల్తా పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన  కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవడాలో జరిగింది.

ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని  బిచ్కుంద ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు  తుకారం (దేవడా గ్రామం), సాయి (బిచ్కుంద), శంకర్(మద్నూర్) ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి.

ఇవీ చూడండి:ఆ కుటుంబాన్ని చలానా కలిపింది!

Last Updated : Dec 17, 2020, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details