Pakistan Wheat Crisis : ఘోరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. నిత్యవసరాల సరకులు సైతం సరఫరా చేయలేని పరిస్థితిలో ఉంది. జీతాల్లో కోతలు విధిస్తూ.. నిత్యవసరాల ధరలను అదుపుచేయలేక కొట్టుమిట్టాడుతుంది పాక్. దేశంలోని అనేక ప్రాంతాల్లో గోధుమల కొరత ఏర్పడి పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఘోరమైన పిండి సంక్షోభం ఏర్పడి అనేక చోట్ల తొక్కిసలాటలు జరిగాయి. పిండిని దక్కించుకునేందుకు ప్రజలు రోజు అనేక గంటల పాటు రోడ్లపైనే వేచిచూస్తున్నారు. సాయుధ దళాలు పంపిణీ చేస్తున్న పిండి వాహనల చుట్టూ ప్రజలు ఎగబడుతున్నారు.
పాక్లో విపరీతంగా పెరిగిన పిండి ధరలు
- కిలో గోధుమలు కరాచిలో రూ.140-160
- ఇస్లామాబాద్లో 10 కేజీల పిండి బ్యాగ్ రూ.1,500
- పెషావర్లో 10 కేజీల పిండి బ్యాగ్ రూ.1,500
- ఖైబర్ పక్తున్ఖ్వాలో 20కిలోల పిండి బ్యాగ్ రూ.3,100
- పంజాబ్ ప్రావిన్స్లో 20కేజీల పిండి రూ.2,800
"పాక్లో పిండి నిల్వలు పూర్తిగా అయిపోయాయి. తమకు తక్షణమే 4 లక్షల గోధుమ పిండి బస్తాలు అవసరం. లేకపోతే మరింత సంక్షోభం పెరిగే అవకాశం ఉంది"
- జమరాక్ అచక్జాయి, బలూచిస్థాన్ ఆహార శాఖ మంత్రి