Suu kyi court sentence: పలు క్రిమినినల్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న మయన్మార్ కీలక నేత ఆంగ్ సాన్ సూకీకి ప్రత్యేక కోర్టు మరో నాలుగేళ్లు శిక్ష విధించింది. వాకీ-టాకీలను అక్రమంగా దిగుమతి చేసుకోవడం.. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెను న్యాయస్థానం దోషిగా తేల్చింది.
గత నెలలో ఆంగ్సాన్ సూకీని ఇతర కేసుల్లో దోషిగా తేల్చిన కోర్టు.. నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై వ్యతిరేకత రావడంతో సైన్యం దాన్ని సగానికి తగ్గించింది.
ఎన్నికల్లో అక్రమంగా గెలిచారంటూ గతేడాది ఫిబ్రవరిలో సూకీ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం.. ఆమెపై పలు కేసులు పెట్టింది. సైన్యం తమ చర్యలను సమర్థించుకోవడానికి సూకీపై అనవసరంగా కేసులు మోపుతున్నారని ఆమె మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఆంగ్సాన్ సూకీ మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా చేసేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని వెల్లడించారు.
జీవితాంతం నిర్బంధంలోనేనా..!