తెలంగాణ

telangana

కరోనాపై పోరులో భారత్​కు మద్దతుగా ఐరాస

By

Published : Apr 28, 2021, 12:10 PM IST

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారత్​ చేస్తున్న పోరాటానికి అంతర్జాతీయ సహాయం అందించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఈ మేరకు న్యూయార్క్​లో జరిగిన 75వ సర్వసభ్య సమావేశంలో యూఎన్​ సెక్రటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు.

antonio guterres
ఆంటోనియో గుటెరస్

కరోనాతో భారత్‌ సతమతం అవుతున్న వేళ.. తమ సమీకృత సప్లైచైన్ ద్వారా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ మేరకు.. యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు.

భారత్‌లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఐరాస​లో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి నుంచి సమాచారం తెలుసుకుంటున్నట్లు గుటెరస్​ అధికార ప్రతినిధి ఫర్హాన్ హాగ్ చెప్పారు. భారత్‌లో పనిచేసే.. యూఎన్‌కు చెందిన అంతర్జాతీయ సిబ్బంది లేదా భారతీయ సిబ్బంది కరోనా బారిన పడకుండా.. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు తమ నుంచి ఏ విధమైన సాయం భారత్‌కు అందలేదని.. భారత్‌ కోరుకుంటే మాత్రం సిద్ధంగా ఉన్నామని యూఎన్ తెలిపింది.

మహమ్మారి కట్టడిలో సహకరించేందుకు ఐరాస నుంచి.. సిబ్బందిని పంపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. ఇప్పటికే.. భారత్‌లో ఉన్న యూఎన్​ సిబ్బంది ఆ మేరకు సహకరిస్తున్నారని కూడా హాగ్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details