తెలంగాణ

telangana

టెక్సాస్​లో 100 దాటిన మంచు తుపాను మృతులు

By

Published : Mar 26, 2021, 8:58 AM IST

అమెరికాలో మంచు తుపాను వల్ల మరణించినవారి సంఖ్య 100 దాటినట్లు అక్కడి అధికారులు తెలిపారు. తుపానుకు తోడు, అత్యల్ప ఊష్టోగ్రతల వల్ల మృతులు మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

Texas death toll from February storm, outages surpasses 100
టెక్సాస్​లో 100 దాటిన మంచు తుపాను మృతులు

అమెరికా టెక్సాస్​ రాష్ట్రంలో మంచు తుపాను కారణంగా చనిపోయినవారి సంఖ్య పెరుగుతోంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 111 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఎక్కువ మంది అత్యల్ప ఉష్ణోగ్రత వల్లే మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్య విభాగం తెలిపింది. మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

తుపాను కారణంగా విద్యుత్​ సరఫరా నిలిచిపోయి దాదాపు 40 లక్షల మంది అంధకారంలో ఉన్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల.. పైపులైన్లలో నీరు గడ్డకట్టుకుపోయింది. తాగునీరు అందక లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు.

ఇదీ చూడండి:మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి బైడెన్​ సై!

ABOUT THE AUTHOR

...view details