స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై మాట్లాడింది మరో హీరోయిన్ రష్మిక. అలానే సామ్తో తనకున్న అనుబంధం గురించి కూడా చెప్పింది. సామ్ మయోసైటిస్తో బాధపడుతోన్న విషయం ప్రకటించే వరకూ తనకు తెలియదని చెప్పింది. సమంతను తాను ఎప్పటికీ ఒక అమ్మలా రక్షించాలనుకుంటున్నట్లు పేర్కొంది. సామ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెను ఎప్పటికీ ఒక స్ఫూర్తిగా భావిస్తుంటానని తెలిపింది. తాను నటించిన 'వారిసు', 'మిషన్ మజ్ను' మూవీస్ విడుదల సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది.
"సమంత అద్భుతమైన మహిళ. ఆమె ఎంతో దయ కలిగిన, అందమైన వ్యక్తి. ఒక అమ్మలాగా తనని ఎప్పుడూ సంరక్షించాలనుకుంటున్నాను. మయోసైటిస్ గురించి ఆమె ప్రకటించిన తర్వాతనే నాక్కూడా తెలిసింది. ఎందుకంటే, అంతకు ముందు తను ఎప్పుడూ ఆ విషయం గురించి మాట్లాడిన సందర్భాల్లేవు. జీవితంలో ఎన్నో సవాళ్లతో పోరాడి నిలబడిన వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఏవిధంగా అయితే స్ఫూర్తిగా భావిస్తారో అదేవిధంగా నేను కూడా ఆమె నుంచి ప్రేరణ పొందుతున్నాను. ఆమెకు అన్నివిధాలుగా మంచే జరగాలని భావిస్తున్నా" అని రష్మిక తెలిపారు.