తెలంగాణ

telangana

వైరల్​గా ప్రభాస్​-కృతిసనన్​ ఆడియో కాల్​​, అసలేం మాట్లాడుకున్నారంటే..

By

Published : Sep 1, 2022, 1:51 PM IST

Updated : Sep 1, 2022, 2:36 PM IST

KoffeeWithKaran7 kriti and prabhas call

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​, హీరోయిన్ కృతిసనన్​ ఆడియో కాల్​ వైరల్​గా మారింది. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే..

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్​ జోహార్​ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో 'కాఫీ విత్​ కరణ్'​. ఎప్పుడూ సోషల్ ​మీడియాలో కాంట్రవర్సీతో హాట్​టాపిక్​గా ఉండే ఈ కార్యక్రమం ఈసారి మాత్రం పాజిటివ్​ రెస్పాన్స్​తో వైరల్​గా మారింది. ఎందుకంటే ఈ సారి ఈ షోలో పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ భాగస్వామి అయ్యారు. అదేంటి ప్రభాస్​ ఎప్పుడు వచ్చారా అనుకుంటున్నారా?

కాఫీ విత్ కరణ్​ తాజా ఎపిసోడ్​కు టైగర్​ ష్రాఫ్​, కృతి సనన్​ విచ్చేసి సందడి చేశారు. సరదా సంభాషణలో నవ్వులు పూయించారు. ఈ క్రమంలోనే వ్యాఖ్యాత కరణ్​.. హీరోహీరోయిన్లలిద్దరికీ సెలబ్రెటీలు కాలింగ్​ రౌండ్​ టాస్క్ ఇచ్చారు.

అంటే కంటెస్టెంట్​ ఎవరైనా ఓ సెలబ్రిటీకి కాల్​ చేసి "హే.. కరణ్​ ఇట్స్​ మీ" అని వాళ్ల చేత అనిపించాలి. దీంతో కృతి.. ఆదిపురుష్​ మూవీలో తన కో స్టార్​ అయిన ప్రభాస్​కు కాల్​ చేయగా.. ఆయన కృతితో సహా కరణ్​తో మాట్లాడతారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఫుల్​గా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వాయిస్ కన్వర్​జేషన్​ సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. ప్రభాస్​ గొంతు విన్న అభిమానుల ఆనందంతో సంబరపడిపోతున్నారు.

ఇదీ చూడండి: అందుకే రహస్యంగా పెళ్లి చేసుకున్నా: కత్రినా కైఫ్​

Last Updated :Sep 1, 2022, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details