తెలంగాణ

telangana

రూ.850 టికెట్ 11వేలు.. ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ మార్కెట్

By

Published : Sep 25, 2022, 5:37 PM IST

Updated : Sep 25, 2022, 6:17 PM IST

Ticket sales in block
Ticket sales in block

17:32 September 25

ఉప్పల్ స్టేడియం సమీపంలో బ్లాక్‌లో టిక్కెట్ల విక్రయాలు

అరెస్టైన ముగ్గురు నిందితులు

ఇవాళ ఉప్పల్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య చివరి టీ 20 మ్యాచ్‌ జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో బ్లాక్‌ టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్లాక్‌లో టికెట్స్‌ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్బీనగర్‌ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 టికెట్లు, మూడు సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుగులోత్‌ వెంకటేశ్‌, ఇస్లవత్ దయాకర్‌, గుగులోత్‌ అరుణ్‌గా గుర్తించారు. నిందితులు రూ.850 టికెట్లను రూ.11 వేలకు అమ్ముతుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. తొలి టీ20లో ఓడినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో గెలిచిన భారత్‌ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్‌ మైదానంలో మ్యాచ్‌ జరుగుతుండటంతో హైదరాబాద్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఈ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 25, 2022, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details