తెలంగాణ

telangana

విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం

By

Published : Jan 22, 2023, 8:00 AM IST

విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం
విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం ()

Train Accident: రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందారు. ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద నున్న రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు పురుషులు, ఒక మహిళ వస్తుండగా-గూడూరు వైపు నుంచి విజయవాడ వెళుతున్న నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఇద్దరు పురుషులు రైలు పట్టాలపైనే మృతి చెందగా.. మహిళ పట్టాల పైనుంచి కిందపడి చనిపోయారు.

విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం

Three persons killed train rams: రైలు ఢీకొని ముగ్గురు దుర్మరణం చెందారు. ఏపీ నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద నున్న రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు పురుషులు, ఒక మహిళ వస్తుండగా- గూడూరు వైపు నుంచి విజయవాడ వెళుతున్న నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఇద్దరు పురుషులు రైలు పట్టాలపైనే మృతి చెందగా.. మహిళ పట్టాల పై నుంచి కిందపడి చనిపోయారు. ముగ్గురూ 45- 50 ఏళ్లలోపు వారే. వారి చేతుల్లో సంచులు ఉన్నాయి. కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రం పురుషులు రైలు పట్టాల పక్కన ఉండగా.. మహిళ పట్టాలపై ఉన్నారని.. ఆమెను తప్పించబోయి.. వారు కూడా మృత్యువాత పడ్డారని చెబుతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే, సంతపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. లభ్యమైన సంచులను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారా? బంధువులానేది తెలియాల్సి ఉంది. సంచుల్లో తితిదే లాకర్‌ అలాట్‌మెంట్‌ టిక్కెట్టు ఉన్నట్లు గుర్తించారు. దాంతో పాటు ఒక ఫోన్‌ నంబరు కూడా ఉందని తెలిసింది. ఫోన్‌ చేస్తుంటే ఎవరూ తీయకపోవడంతో.. మరో ఆధారం కోసం యత్నించారు. ఆ క్రమంలో ఒక సంచిలో విజయవాడ కార్పొరేషన్‌కు చెందిన వార్డు ఎడ్యుకేషన్‌ సెక్రటరీ తెన్నేటి సరస్వతీరావు పేరుతో ఓ గుర్తింపు కార్డు లభించింది. అందులోని ఫొటో ఆధారంగా.. ఇద్దరు పురుషుల్లో.. ఒకరు సరస్వతీరావు అయి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు.

తితిదే లాకర్‌ అలాట్‌మెంట్‌ పేరుతో దొరికిన స్లిప్పులో బి.రమేష్‌నాయక్‌ అనే పేరు ఉంది. అతడి ఆధార్‌ కార్డు నంబరు కూడా దానిపై ఉంది. మృతుల్లో ఈయన కూడా ఉన్నారా? లేదా? అని విచారిస్తున్నారు. తితిదే టిక్కెట్‌ నిన్న సాయంత్రం 6.59కి తీసుకున్నట్లు ఉంది. రైలు విజయవాడ వైపు వెళుతుండటం.. గుర్తించిన ఆధారాల్లో విజయవాడ అని ఉండటంతో.. వీరు ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కూడా పడి ఉంటారని అనుమానిస్తున్నారు. రాత్రి సుమారు 10గంటల సమయంలో రైలు ఢీకొన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. మృతుల వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదానికి మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details