తెలంగాణ

telangana

3 persons drowned in Sagar canal: సాగర్ కాల్వలో ముగ్గురు గల్లంతు!

By

Published : Dec 7, 2021, 7:36 AM IST

Updated : Dec 7, 2021, 8:28 AM IST

TELUGU NEWS Three persons drowned in Kattakuru Sagar canal khammam district

07:33 December 07

కట్టకూరు వద్ద సాగర్ కాల్వలో గాలింపు

Missing in Sagar Canal : పొట్టకూటి పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన వారు అదృశ్యమైపోయారు. తమ వారు ఏమయ్యారో తెలియక.. బంధువులు, స్నేహితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో సాగర్​ కాల్వలో ముగ్గురు గల్లంతైనట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. వరికోత కోసం పంజాబ్​ వాసులు ముదిగొండ మండలంలోని కట్టంకూరుకు వచ్చారు. వారిలో ముగ్గురు సోమవారం సాయంత్రం కట్టంకూరులోని సాగర్​ కాల్వ వద్దకు వెళ్లారు. అప్పటి నుంచి వారు వెనుదిరిగి రాలేదు.

తమ వారు రాత్రి నుంచి కనిపించట్లేదని.. పంజాబ్​ వాసులు స్థానికులకు తెలిపారు. అందరూ గాలిస్తుండగా.. సాగర్​ కాల్వ వద్దకు వెళ్లిన వారి సెల్​ఫోన్లు, చెప్పులు కనిపించాయి. కాల్వ గట్టు మీద వీటిని ఉంచి.. వారు నీటిలోకి వెళ్లి గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఉంటారని.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గల్లంతైనట్లు అనుమానిస్తున్న వారి కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవీ చూడండి:

Last Updated :Dec 7, 2021, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details