తెలంగాణ

telangana

Shilpa Chowdary custody: విచారణలో విలపించిన శిల్ప చౌదరి.. 6 గంటల పాటు ప్రశ్నల వర్షం..

By

Published : Dec 3, 2021, 12:42 PM IST

Updated : Dec 3, 2021, 7:54 PM IST

Shilpa Chowdary custody news, Shilpa Chowdary Cheating Case
శిల్పా చౌదరిని కస్టడీకి తీసుకున్న పోలీసులు

Shilpa Chowdary custody news: అధిక వడ్డీ కేసు నిందితురాలు శిల్పా చౌదరిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించగా.. దాదాపు ఆరు గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. ఆమె బినామీలు, బ్యాంకు ఖాతాలపై లోతుగా ఆరా తీశారు.

Shilpa Chowdary custody: అధిక వడ్డీల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో నిందితురాలు శిల్ప చౌదరిని మొదటి రోజు ఆరు గంటల పాటు పోలీసులు విచారించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆమెను ప్రశ్నించారు. ఆమె బినామీలు, బ్యాంకు ఖాతాలపై లోతుగా ఆరా తీశారు. ఇప్పటి వరకు నమోదైన ఫిర్యాదులపై శిల్ప వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించిందనే కోణంలోనూ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. రేపు మరోసారి నార్సింగ్‌ పోలీసులు ఆమెను విచారించనున్నారు. పోలీసుల విచారణలో ఆమె విలపించినట్లు సమాచారం.

పెట్టుబడుల పేరుతో మోసాలు

Shilpa Chowdary custody news : పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన మహిళ.. శిల్పా చౌదరిని నార్సింగి పోలీసులు రెండు రోజుల కస్టడీ తీసుకున్నారు. కోర్టు అనుమతితో శిల్పను విచారిస్తున్నారు. చంచల్​గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శిల్పకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నార్సింగి ఠాణాకు తీసుకెళ్లారు. శిల్ప ఎవరెవరి వద్ద నుంచి ఎంత సొమ్ము తీసుకుందనే ప్రశ్నించారు. డబ్బులు ఎక్కడకు మళ్లించారు.. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపైనా పోలీసులు లోతుగా ఆరా తీశారు. శిల్పా చౌదరిపై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయగా.. రూ.7 కోట్ల 5లక్షలు తీసుకుందని పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు చేసిన వాళ్లలో సినీ హీరో మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని ఉన్నారు. శిల్పకు రూ.2కోట్లకు పైగా ఇచ్చానని ప్రియదర్శిని తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత శిల్ప బ్యాంకు చెక్కులు ఇచ్చారని... అవి చెల్లకపోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లలోనూ కేసులు నమోదయ్యాయి. 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టును పోలీసులు కోరగా.. రెండు రోజులు విచారణ చేసేందుకు అనుమతిచ్చింది. శిల్పా ఓ చిన్న చిత్రాన్ని నిర్మించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే శిల్ప బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు సేకరించారు.

కిట్టి పార్టీలతో ఆకట్టుకుంటూ..

Shilpa Chowdary Cheating Case: కిట్టి పార్టీల పేరుతో మహిళలను ఆకట్టుకున్న శిల్పాచౌదరి.. స్థిరాస్తి వ్యాపారం కోసమంటూ డబ్బు తీసుకుందని పోలీసులు గుర్తించారు. భారీగా లాభాలిస్తానని నమ్మించి మోసం చేసిందని ఫిర్యాదులు అందాయి. గండిపేటలోని సిగ్నేచర్‌ విల్లాలో పదేళ్లుగా నివాసముంటున్న శిల్పాచౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్‌ ప్రసాద్‌ దంపతులు తమకు తాము ధనవంతులుగా ప్రకటించుకున్నారు. టీవీ, సినీ నిర్మాతగా పరిచయం చేసుకున్న శిల్పాచౌదరి సినీప్రముఖుల కుటుంబాల్లోని మహిళలను తరచూ కలుసుకుంటూ వారాంతాల్లో పార్టీల పేరుతో ఆహ్వానించేది. తొలుత కొంతమందితో మొదలైన కిట్టీ పార్టీలను తర్వాత జూదంగా మార్చింది. దివానోస్‌ పేరుతో జూదశాలను ప్రారంభించింది. సంపన్న కుటుంబాలకు చెందిన మహిళల్లో 90 మందిని సభ్యులుగా చేర్పించుకుంది. వారాంతాల్లో విందులు, వినోదాలు ఏర్పాటు చేసేది.

మోసాలతో విలాసాలు..

Shilpa fraud: మోసం చేయడమే ఆమె లక్ష్యం. భార్య చేసే మోసాలకు వత్తాసు పలకడమే భర్త లక్షణం. అధిక వడ్డీలు, వ్యాపారాల్లో లాభాల పేరిట వల వేసి.. వారి నుంచి కోట్లలో డబ్బులు తీసుకుని.. విలాసవంతమైన జీవితాన్ని గడపడమే ఆ దంపతుల ధ్యేయం. అలా మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి గుట్టు ఎట్టకేలకు బయటపడింది. హైదరాబాద్​కు చెందిన వ్యాపారవేత్త శిల్పను, ఆమె భర్త శ్రీనివాస్​ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కోసం శిల్పను 2 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఆమె భర్తకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది.

ఇదీ చదవండి:Shilpa Chaudhary case: శిల్పా చౌదరిని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్‌

Last Updated :Dec 3, 2021, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details