తెలంగాణ

telangana

బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. జిల్లా దాటించి కారులో విడిచి వెళ్లిన దుండగులు​

By

Published : Oct 3, 2022, 11:48 AM IST

boy kidnap in guntur
boy kidnap in guntur ()

POLICE SOLVED KIDNAP CASE: ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లాలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్​ కథ సుఖాంతమైంది. నెల్లూరు జిల్లా కావలి వద్ద బాలుడిని పోలీసులు గుర్తించి చిలకలూరిపేటకు తీసుకొస్తున్నారు.

POLICE SOLVED KIDNAP CASE: ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఓ ఎనిమిదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ​ సుఖాంతమైంది. దసరా పండుగ కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చిన రాజీవ్‌సాయి(8) అనే బాలుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్​ చేసి.. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఓ కారులో వదిలి పరారయ్యారు. బాలుడిని గుర్తించిన పోలీసులు విచారించి చిలకలూరిపేటకు తీసుకొస్తున్నారు. బాలుడు క్షేమంగా ఉండటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

అంతకుముందు ఇంటి సమీపంలోని ఆలయం వద్ద ఆడుకుంటున్న రాజీవ్‌సాయిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.కోటి డిమాండ్ చేశారు. అప్రమత్తమైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు బాలుడిని నెల్లూరు జిల్లా కావలి వద్ద సురక్షితంగా కాపాడారు. రాజీవ్‌సాయి తండ్రి చెన్నైలో ధాన్యం వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details