జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలో అధిక లోడుతో వస్తున్న 6 ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు. లారీలను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు అప్పగించారు. ఇక మీదట ఎవరైనా.. లారీల్లో అధిక లోడుతో ఇసుక తరలిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. వాటిని సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఓనర్లను హెచ్చరించారు.
డీఎస్పీ, సీఐ ఆదేశాలతో ట్రైనీ ఎస్సైలు రాజు, రాధిక, సిబ్బందితో కలిసి బాంబుల గడ్డ వద్ద వాహనతనిఖీలను ఎస్సై ఉదయ్ కిరణ్ నిర్వహించారు.
ఇదీ చూడండి:కమీషన్ ఆశచూపి.. రూ.1500 కోట్లు కాజేసి!