తెలంగాణ

telangana

టీ చల్లగా ఉందని గొడవ.. చివరకు పోలీస్ స్టేషన్​లో..

By

Published : Jan 27, 2023, 11:40 AM IST

Clash due to tea: ఉదయాన్నే చాలా మంది టీ తాగుతారు. టీ చల్లగా ఉందని గ్రామస్థులు హోటల్​ సిబ్బందితో ఘర్షణకు దిగిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. టీ స్టాల్​లో మొదలైన గొడవ చివరికి ఎక్కడి వరకు వెళ్లిందంటే..

Clash due to tea
టీ వలన గొడవ పడిన వ్యక్తులు

టీ చల్లగా ఉందని గ్రామస్థుల హోటల్​ సిబ్బందితో గొడవ

Clash due to tea:టీ చల్లగా ఉందని చెప్పడంతో మొదలైన గొడవ.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు ఇచ్చుకునే వరకూ వెళ్లింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పటాన్‌చెరు శివారు బాహ్యవలయ రహదారి కూడలిలో ఉన్న ఓ హోటల్‌లో పోచారం గ్రామస్థులు టీ తాగేందుకు వెళ్లారు. హోటల్ సిబ్బంది ఇచ్చిన టీ చల్లగా ఉండటంతో వారితో వాగ్వాదానికి దిగారు.

చినికి చినికి గాలి వానైనట్లు టీ కోసం మొదలైన చిన్న గొడవ ఘర్షణకు దారి తీసింది. ఈ గొడవలో హోటల్ అద్దాలు ధ్వంసమయ్యాయి. హోటల్​లోని సామగ్రి అంతా చెల్లాచెదురైంది. గొడవ పడింది సరిపోక.. ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించారు. ఒకరిపై మరొకరు పటాన్​చెరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details