తెలంగాణ

telangana

టవేరాను ఢీకొన్న ద్విచక్రవాహనం... వ్యక్తి మృతి

By

Published : Apr 9, 2021, 9:59 AM IST

టవేరాను ద్రిచక్రవాహనం ఢీకొన్న ఘటన కొడంగల్​లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

one person died in road accident
టవేరాను ఢీకొన్న ద్విచక్రవాహనం

వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రంలో హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే అంతరాష్ట్ర రహదారిపై తెల్లవారు జామున 4గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. టవేరాను ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో బొంరాస్​పేట గ్రామానికి చెందిన గడ్డల బాలు(32) అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా... కోట్ల యాదయ్య (30) అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. వీరు కొడంగల్ మండలం లక్ష్మీపల్లిలోని యాదయ్య అత్తగారింటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఇదీ చదవండి:బైక్ కింద పడి ఆరేళ్ల బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details