తెలంగాణ

telangana

Gachibowli Road Accident Today : గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి

By

Published : Dec 18, 2021, 7:16 AM IST

Updated : Dec 18, 2021, 10:16 AM IST

Gachibowli road accident

07:12 December 18

Gachibowli Road Accident Today : గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం

Gachibowli Road Accident Today : రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని హెచ్​సీయూ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు డివైడర్​ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, ఓ బ్యాంకు ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందారు. మరో జూనియర్ ఆర్టిస్టు సిద్ధుకు తీవ్ర గాయాలయ్యాయి. అతణ్ని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Junior Artists Died in Gachibowli Accident : తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో అమీర్‌పేటలోని ఓ వసతిగృహంలో ఉంటున్న ఎన్‌. మాసన(22), ఎం. మానస(21)తో పాటు విజయవాడకు చెందిన అబ్దుల్‌ రహీమ్‌(25) మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. అబ్దుల్ రహీమ్ మాదాపూర్‌లోని యాక్సిస్ బ్యాంకులో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఎం.మానస స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిగా గుర్తించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నలుగురికి ఎలా పరిచయం ఉందన్న వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి లింగంపల్లి ఎందుకు వెళ్తున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు చెప్పారు.

Last Updated :Dec 18, 2021, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details