తెలంగాణ

telangana

పండగపూట విషాదం... లారీ బోల్తా, నలుగురు మృతి

By

Published : Jan 14, 2022, 7:50 AM IST

Updated : Jan 14, 2022, 8:35 AM IST

Tadepalligudem Accident

07:48 January 14

Tadepalligudem Accident: తాడేపల్లిగూడెంలో లారీ బోల్తా, నలుగురు మృతి

పండుగపూట విషాదం... లారీ బోల్తా, నలుగురు మృతి

Tadepalligudem Accident: ఆంధ్రప్రదేశ్​లో పండగ పూటే విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

తాడేపల్లిగూడెం వద్ద చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్‌ నిద్ర మత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:Live Video: యూకే నుంచి వచ్చి.. స్నేహితున్ని కలిసేందుకు వెళ్తూ..

Last Updated :Jan 14, 2022, 8:35 AM IST

ABOUT THE AUTHOR

...view details