Live Video: యూకే నుంచి వచ్చి.. స్నేహితున్ని కలిసేందుకు వెళ్తూ..

author img

By

Published : Jan 13, 2022, 10:55 PM IST

uk return younger died in rtc bus accident at malkajigiri

Road accident: సెలవుల్లో యూకే నుంచి వచ్చాడు. వచ్చే నెలలో తిరుగు ప్రయాణమున్న ఆ యువకుడు.. స్నేహితుడిని కలిసేందుకు బయలుదేరాడు. మిత్రున్ని కలవకుండానే.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరిలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

యూకే నుంచి వచ్చి.. స్నేహితున్ని కలిసేందుకు వెళ్తూ..

Road accident: మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పరిధిలోని ఆర్​కే నగర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. ములుగు జిల్లా ఏటూరునాగారంకి చెందిన హర్షవర్దన్ రెడ్డి యూకేలో ఎమ్మెస్ చేస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా అక్కడ సెలవులు ఇవ్వడంతో సొంత ఊరికి వచ్చాడు. వచ్చే నెలలో తిరిగి వెళ్లాల్సివుంది.

ఈ మధ్యలో మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో ఉంటున్న తన స్నేహితుడిని కలుద్దామనుకున్నాడు. బుధవారం రాత్రి స్నేహితుని దగ్గరికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలోనే.. ఆర్​కేనగర్ దగ్గర బైక్​ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కింద పడిన హర్షవర్దన్​పై నుంచి బస్సు వెళ్లింది. కొంచెం దూరం హర్షవర్దన్ రెడ్డిని బస్సు లాక్కెళ్లింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీకెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

ప్రమాదంలో హర్షవర్దన్​కు తీవ్రగాయాలు కాగా... స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. హర్షవర్దన్​ను ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై హర్షవర్దన్​ సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.