తెలంగాణ

telangana

ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు.. అందులో 40మంది ప్రయాణికులు

By

Published : Oct 21, 2022, 10:53 AM IST

Updated : Oct 21, 2022, 11:10 AM IST

Fire Accident in RTC bus: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. పెదపారుపూడి మండలం పులవర్తి గూడెం వద్ద ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ప్రయాణికులు కిందికి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Fire Accident in RTC bus
Fire Accident in RTC bus

ire Accident in RTC bus: ఏపీ కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెదపారుపూడి మండలం పులవర్తి గూడెం వద్ద ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు విజయవాడ నుంచి గుడివాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పులవర్తిగూడెం సమీపంలో ఉన్నట్లుండి బస్సులో భారీ మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానికులు తెలిపారు.

మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.వెంటనే ప్రయాణికులు కిందికి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు సాంకేతిక లోకం కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ప్రయాణికులు భావిస్తున్నారు. ఈఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మంటలు చెలరేగిన నేపథ్యంలో బయటకు దిగే కంగారులో చాలా మంది తమ వస్తువులను బస్సులోనే వదిలేయడంతో అవన్నీ కాలి బూడిదయ్యాయి. బ్యాగుల్లో దాచుకున్న నగదు, బంగారం, దుస్తులు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు.. అందులో 40మంది ప్రయాణికులు

ఇవీ చదవండి:బీమా సొమ్ము స్వాహా ఉదంతంలో విచారణ వేగవంతం చేసిన కార్మికశాఖ

ప్లేట్​లెట్లకు బదులు ఫ్రూట్​ జ్యూస్​ ఎక్కించిన వైద్యులు.. డెంగీ రోగి మృతి

Last Updated :Oct 21, 2022, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details