తెలంగాణ

telangana

electric shock news 2021 : విద్యుదాఘాతంతో వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతి

By

Published : Nov 20, 2021, 10:20 AM IST

విద్యుదాఘాతం(electric shock news 2021)తో మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు బలయ్యారు. దండేనికి తువ్వాలు ఆరేస్తూ.. విద్యుదాఘాతానికి గురైన మహిళను కాపాడటానికి వెళ్లిన ఆమె భర్త కూడా మృతి చెందారు. మరో ఘటనలో.. వ్యవసాయ బావి మోటారును బంద్ చేసేందుకు వెళ్లిన ఓ రైతుకు విద్యుత్ తీగలు తగిలి మరణించగా.. ఇళ్లు శుభ్రం చేస్తూ.. విద్యుత్ హీటర్​ తగిలి కరెంటు షాక్​కు(electric shock news 2021) గురై ఓ మహిళా కూలీ దుర్మరణం చెందారు.

electric shock news 2021
electric shock news 2021

మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కరెంటు కాటు(electric shock news 2021)కు నలుగురు బలయ్యారు. వీరిలో దంపతులతో పాటు ఒక రైతు, కూలీ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో శుక్రవారం రాత్రి విద్యుదాఘాతంతో దంపతులు దుర్మరణం చెందారు. జీకేపేట పంచాయతీలోని సింగారం-2 కాలనీకి చెందిన ఆనపర్తి తిరుపతమ్మ(28) స్నానానికి వెళ్లొచ్చి.. తువ్వాలును ఇనుపతీగపై ఆరేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆ దండేనికి విద్యుత్ సరఫరా అవుతుండటంతో షాక్ కొట్టి ఆమె కేకలు వేశారు. ఆమెను రక్షించే ప్రయత్నంలో భర్త ఉపేందర్(32) కూడా విద్యుదాఘాతానికి(electric shock news 2021) గురయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరికి ఐదు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలున్నారు.

మోటారు బంద్ చేద్దామని వెళ్లి..

మహబూబాబాద్ మండలం సింగారం శివారు ఇస్లావత్ తండా పంచాయతీ పరిధి వెంకట్రామ్​తండాకు చెందిన ధరావత్ హరిసింగ్(32) గురువారం సాయంత్రం చెరువు సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలి మృతి(electric shock news 2021) చెందారు. వ్యవసాయ బావి మోటారును బంద్ చేసేందుకు వెళ్లి ఆయన ప్రమాదానికి గురయ్యారు.

హీటర్ తాకి మహిళా కూలీ..

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుషాపూర్​లో సుమత(36) అనే మహిళా కూలీ శుక్రవారం రోజున.. విద్యుదాఘాతంతో మరణించారు. కార్తికపౌర్ణమి పర్వదినం కావడం వల్ల ఇంటిని శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ హీటర్​కు తాకి కన్నుమూశారు. కార్తిక పౌర్ణమి రోజున వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతి చెందడం.. వారి కుటుంబాల్లో విషాదం నింపింది.

ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదాలు..

సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం(electric shock) చోటుచేసుకుంది. నేడు తెరాస ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా(TRS dharna) సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లలో ఓ యువకుడు విద్యుదాఘాతం(electric shock)తో మృతి చెందాడు. ఘటనలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరంలో విషాదం చోటుచేసుకొంది. జడ్పీ హైస్కూల్‌లో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతిచెందారు. మృతుడు పదో తరగతి విద్యార్థి గోపీచంద్‌ (15) గా గుర్తించారు.

నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి ఓ యువరైతు బలయ్యాడు. అతని మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details