తెలంగాణ

telangana

Delhi Liquor Scam: తెరపైకి మరో పేరు.. రెండ్రోజులుగా వారిపై ఈడీ ప్రశ్నల వర్షం

By

Published : Sep 21, 2022, 7:01 PM IST

Updated : Sep 21, 2022, 8:30 PM IST

Delhi Liquor Scam:
Delhi Liquor Scam: ()

Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారుల వరుస సోదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కరీంనగర్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావు, పెన్నాక శరత్‌ చంద్రారెడ్డి సహా మరికొంత మందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రెండ్రోజులుగా దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రేపు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి.

Delhi Liquor Scam: దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈడీ అధికారులు హైదరాబాద్‌లో వరుసగా సోదాలు నిర్వహించడమే కాకుండా ప్రముఖ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావును రెండు రోజులుగా తమ కార్యాలయానికి పిలిపించి దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. దిల్లీ మద్యం సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ED Raids In Hyderabad updates : తాజాగా ఈరోజు కూడా వెన్నమనేని శ్రీనివాసరావు,పెన్నాక శరత్‌ చంద్రారెడ్డి సహా మరికొంత మందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రెండ్రోజులుగా దిల్లీలోని ఈడీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రేపు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. వెన్నమనేనిని సోమవారం ఏడుగంటల పాటు ప్రశ్నించగా... ఆయన ఈ రోజు కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు. రెండురోజుల క్రితం ఉప్పల్, మాదాపూర్ లోని రెండు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో సోదాలు నిర్వహించిన అధికారులు వివిధ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. యజమానులకు సంబంధించిన వివరాలు సేకరించారు.

ED Raids In Delhi Liquor Scam : దిల్లీలోని మద్యం కుంభకోణంతో ఈ సాఫ్ట్​వేర్ కంపెనీలకు సంబంధం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల్లో లావాదేవీలు లేకున్నా కోట్లలో లాభాలు వస్తున్నట్లు చూపించిన యజమానులు.... డబ్బును హవాలా మార్గంలో ఇతర పనులకు ఉపయోగించినట్లు గుర్తించారు. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి హవాలా మార్గంలో డబ్బులు దిల్లీకి తరలించినట్లు అనుమానిస్తున్నారు. కరీంనగర్​కు చెందిన శ్రీనివాసరావు ఇసుక, మైనింగ్, స్థిరాస్తి వ్యాపారంతో పాటు పలు కంపెనీల్లోనూ డైరెక్టర్‌గా ఉన్నట్లు గుర్తించారు.

నిన్న శ్రీనివాసరావు చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. అవసరమైతే దిల్లీకి రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు శ్రీనివాస్‌రావుకు తెలిపారు. ఈడీ అధికారులు సెల్‌ఫోన్‌ను రామాంతపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించి విశ్లేషించే పనిలో ఉన్నారు.

Last Updated :Sep 21, 2022, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details