తెలంగాణ

telangana

పాస్టర్​ ముసుగులో మూడు పెళ్లిళ్లు.. ఎలా తెలిసిందంటే..

By

Published : Sep 6, 2021, 2:24 PM IST

పేరుకు చర్చిలో పాస్టర్. కానీ అతని చూపంతా యువతులపైనే. వారిని మభ్యపెట్టి.. లోబరుచుకుని.. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకునే రకం. ఈ విషయం తెలియని అమ్మాయిలు.. ఆ పాస్టర్​ ట్రాప్​లో చిక్కుకున్నారు. ప్రేమ అనే మాయలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. ఎట్టకేలకు వాస్తవాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

church-pastor
పాస్టర్​ ముసుగులో మూడు పెళ్లిళ్లు

హైదరాబాద్​ ఉప్పల్​లోని గాస్పర్​ చర్చిలో జోసఫ్ పాస్టర్​గా పనిచేస్తూ... ఓ టీవీ ఛానల్​లో మత ప్రభోధకుడిగా వ్యవహరిస్తున్నాడు. మంచి మాటలతో ప్రజలకు హితబోధ చేసే జోసఫ్​లో మరో కోణం ఉంది. అదే యువతులను మభ్య పెట్టడం. చర్చికి వచ్చే యువతులే అతనికి టార్గెట్. వారికి మాయ మాటలు చెప్పి... మంచిగా ఉన్నట్లు నటిస్తూ వారిని లొంగదీసుకునేవాడు. అలా జోసఫ్ ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడపి... మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.

ప్రేమ పేరుతో పెళ్లిళ్లు

ఎలా తెలిసిందంటే..

ఈ మధ్య కాలంలో జోసెఫ్ యువతులపై లైంగిక దాడులకు పాల్పడుతూ... బెదిరింపులకు పాల్పడ్డాడని యువతులు ఆరోపించారు. ఈ క్రమంలోనే అతనికి మూడు పెళ్లిళ్లు జరిగినట్లు యువతులకు తెలిసింది. ఆగ్రహానికి లోనైన బాధితులు జోసెఫ్​ను నిలదీశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాస్టర్​ను అరెస్టు చేసి.. రిమాండ్​కు పంపినట్లు సీఐ అంజిరెడ్డి తెలిపారు. ఆ ముగ్గురిని ప్రేమలో దించి... అదే చర్చిలో పెళ్లి చేసుకోవడం గమనార్హం.

పాస్టర్ జోసెఫ్

ABOUT THE AUTHOR

...view details