తెలంగాణ

telangana

పరీక్ష రాసి వస్తుండగా.. పదో తరగతి విద్యార్థిపై హత్యాయత్నం!

By

Published : May 6, 2022, 7:01 PM IST

Attack on Tenth class student: పరీక్ష రాసి ఇంటికి తిరిగివస్తున్న పదో తరగతి విద్యార్థిపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో విద్యార్థికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏపీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

murder attempt on tenth class student
పదో తరగతి విద్యార్థిపై హత్యాయత్నం

Attack on Tenth class student: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లాలో పదోతరగతి పరీక్ష రాసి వస్తున్న విద్యార్థిపై.. దుండగులు దాడి చేశారు. తీవ్రగాయాలైన విద్యార్థిని.. విశాఖ కేజీహెచ్​కు తరలించారు. పాత పోస్టాఫీసు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిపై కేసు నమోదు చేసుకున్న వన్​టౌన్​ పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే గాయపడిన విద్యార్థిపై గతంలో హత్యాయత్నం కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుత ఘటనకు గల కారణాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.

ఇవీ చదవండి:హైదరాబాద్‌ చేరుకున్న రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్‌ నేతల ఘనస్వాగతం

ABOUT THE AUTHOR

...view details