తెలంగాణ

telangana

Atm vehicle driver arrest: రూ.36 లక్షలతో పరారైన ఏటీఎం వాహన డ్రైవర్ అరెస్టు

By

Published : Feb 24, 2022, 12:20 PM IST

Atm vehicle driver arrest: ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసే వాహనంతో పాటు రూ.36 లక్షల నగదుతో ఈ నెల 19న ఏటీఎం వాహన డ్రైవర్ ఉడాయించిన ఘటనలో మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు కర్నూలులో ఉన్నట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దుండిగల్ పీఎస్ కి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు.

Atm vehicle driver arrest
నిందితుడు

Atm vehicle driver arrest: మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని సాయిబాబానగర్‌లో గల ఏటీఎంలో రైటర్స్ సంస్థ సిబ్బంది ఈ నెల 19న నగదు నింపుతుండగా... డ్రైవర్ సాగర్ ఏటీఎం వాహనంలో ఉన్న రూ.36 లక్షలతో పరారయ్యాడు.

నిందితుడు

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అతను చోరీ చేసిన వాహనాన్ని నర్సాపూర్ అడవిలో వదిలేసి... నగదుతో వివిధ బస్సులు మారుతూ నిజామాబాద్ చేరుకొన్నాడు. చోరీ చేసిన నగదులో కొంత డబ్బు పెట్టి ఖరీదైన చరవాణి కొన్నాడు. ఆదివారం తిరిగి హైదరాబాద్ చేరుకొని ఓ కారును రూ.8.6 లక్షలకు కొనుగోలు చేశాడు. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టిన దుండిగల్ పోలీసులు నిందితుడు కర్నూలులో ఉన్నట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం దుండిగల్ తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు.

చోరి చేసిన ఏటీఎం వాహనం

అసలు ఏం జరిగిందంటే...

ఏటీఎంలో నగదు డిపాజిట్ చేసే వాహనంతో పాటు రూ.36 లక్షల నగదుతో ఈ నెల 19న డ్రైవర్ పరారైన ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాయిబాబానగర్​లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిబాబా నగర్​లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు నింపేందుకు సాయంత్రం 5 గంటల సమయంలో రైటర్​ సంస్థకు చెందిన వాహనంలో సిబ్బంది వెళ్లారు. రూ.15 లక్షల నగదును యాక్సిస్​ బ్యాంక్​ ఏటీఎంలో నింపేందుకు క్యాషియర్ రంజిత్, గన్​మెన్ రాంబాబు కిందకు దిగారు. ఈ క్రమంలోనే డ్రైవర్ సాగర్ వాహనాన్ని మలుపు కొస్తానని చెప్పి.. అందులో ఉన్న రూ.36 లక్షల నగదుతో పరారయ్యాడు.

ఇదీ చదవండి:Jeedimetla minor girl death case : ఆ బాలికది హత్యా, ఆత్మహత్యా.. ఆ మూడు గంటలు ఏమైంది?

ABOUT THE AUTHOR

...view details