తెలంగాణ

telangana

కేబుల్ బ్రిడ్జి పైనుంచి దుర్గం చెరువులోకి దూకిన యువతి.. పోలీసుల గాలింపు..

By

Published : Sep 28, 2022, 5:41 PM IST

Updated : Sep 28, 2022, 8:00 PM IST

young woman jumped
young woman jumped

Young Woman Commits Suicide: ఓ యువతి కేబుల్ బ్రిడ్జి పైనుంచి నడుచుకుంటూ వచ్చి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే ఉన్న కొందరు యువకులు కాపాడే ప్రయత్నం చేసినా యువతి ఆచూకీ తెలవలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

Young Woman Commits Suicide: దుర్గం చెరువులోకి దూకి స్వప్న అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అలా కేబుల్ బ్రిడ్జి పైనుంచి నడుచుకుంటూ వచ్చిన స్వప్న ఒక్కసారిగా చెరువులోకి దూకింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే కొందరు సందర్శకులు ఆమె దూకడాన్ని గమనించి కాపాడడానికి ప్రయత్నించారు. కానీ ఆమె ఆచూకీ కనిపించలేదు.

Young Woman

స్వప్న దూకిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. యువతి బ్లాక్ కలర్ డ్రెస్ ధరించినట్లు.. ఆమె వయస్సు 25 నుంచి 30 సంవత్సరాలు ఉండవచ్చని అక్కడ చూసిన సందర్శకులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, డీఆర్​ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. స్పీడ్ బోట్స్​తో చెరువులో గాలిస్తున్నారు.

సమాచారం అందుకున్న స్వప్న అక్క ఘటనా స్థలానికి చేరుకుంది. స్వప్న మానసికంగా బాధపడుతోందని తెలిపారు. ఈరోజు ఇంటి నుంచి బయటకు వచ్చిందని తిరిగి ఇంటికి రాలేదని.. పోలీసులు నుంచి ఫోన్ వచ్చాకే తమకు విషయం తెలిసిందని చెప్పారు.

దుర్గం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన యువతి

ఇవీ చదవండి:

Last Updated :Sep 28, 2022, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details