తెలంగాణ

telangana

flood to Irrigation projects : ప్రాజెక్టుల్లోకి భారీ వరద.. గేట్లు ఎత్తి నీటి విడుదల

By

Published : Sep 2, 2021, 10:16 AM IST

ప్రాజెక్టుల్లోకి భారీ వరద
ప్రాజెక్టుల్లోకి భారీ వరద

ఎగువన కురిసిన వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి వరద(flood to Irrigation projects) పోటెత్తింది. భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటం వల్ల పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి.. అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు-19 గేట్లు, పార్వతీ బ్యారేజ్-60 గేట్లు ఎత్తి నీటిని తరలిస్తున్నారు.

ఎగువన కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం(flood to Irrigation projects) వస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, పెద్దపల్లి జిల్లాలోని పార్వతీ బ్యారేజ్​లకు వరద పోటెత్తడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

ఎస్సారెస్పీ 19 గేట్లు ఎత్తివేత..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం(flood to Irrigation projects) కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 61వేల 250 క్యూసెక్కుల నీరు రాగా.. 19 గేట్లు ఎత్తి 81వేల 120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 7500 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.

ఎస్సారెస్పీలో 88.662 టీఎంసీల నీరు..

సాగర్ పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1090.7 అడుగుల మేర నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 88.662 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

పార్వతీ బ్యారేజ్​కు భారీ వరద..

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో సిరిపురం వద్ద నిర్మించిన పార్వతీ బ్యారేజ్​లోకి భారీగా వరద నీరు చేరుతోంది. బ్యారేజ్ నిండుకుండలా మారడం వల్ల అప్రమత్తమైన అధికారులు 60 గేట్లు ఎత్తి 1,23,100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజ్​ ఇన్ ఫ్లో 1,23,100 క్యూసెక్కులు ఉంది.

పార్వతీ బ్యారేజ్ 60 గేట్లు ఎత్తివేత..

పార్వతీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటిమట్టం 8.83టీఎంసీలుండగా.. ప్రస్తుతం 4.250 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆగస్టు 26 నుంచి విడతలవారీగా గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. 74 గేట్లకు గాను నాలుగు రోజులుగా 60 గేట్ల ద్వారా నీటిని దిగువకు తరలిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండండి..

వరద ప్రవాహం(flood to Irrigation projects) ఇలాగే కొనసాగితే మరి కొన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు గోదావరి ఒడ్డున ఉన్న పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాలకు చెందిన గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details