తెలంగాణ

telangana

తెరాస నుంచి నేను వెళ్లలేదు.. కేసీఆరే కావాలని పంపించారేమో: బూర నర్సయ్యగౌడ్

By

Published : Oct 15, 2022, 8:09 PM IST

Boora Narsaiah Goud Clarity on Resigned from TRS: తెరాస నుంచి తాను వెళ్లలేదని.. ముఖ్యమంత్రి కేసీఆరే వద్దనుకుని అవమానించి పార్టీ నుంచి పంపించారేమోనని బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం లేకపోతే.. పార్టీలో ఉండటం వృథా అని రాజీనామా చేసినట్లు తెలిపారు. అభిమానానికి.. బానిసత్వానికి తేడా ఉంటుందన్న ఆయన.. రాజకీయ వెట్టిచాకిరీని తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని లేఖలో పేర్కొన్నారు.

Boora Narsiah Goud
Boora Narsiah Goud

కేసీఆరే కావాలని అవమానించి పార్టీ నుంచి పంపించారు: బూర నర్సయ్యగౌడ్

Boora Narsaiah Goud Clarity on Resigned from TRS: తెరాస నేత, మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్‌ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాలుగు అంశాలను వివరిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్​కు రాజీనామా లేఖ రాశారు. వివిధ అంశాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఎన్నికలో ఎంపీగా ఓటమికి అంతర్గత కుట్రలు కూడా కారణమని తెలిపారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎన్నో అవమానాలు, అవరోధాలను ఎదుర్కొన్నానని వివరించారు. బడుగు, బలహీన వర్గాల సమస్యలను ప్రస్తావించడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేయటం ఎంతో బాధించిందని పేర్కొన్నారు.

అభిమానానికి, బానిసత్వానికి తేడా ఉంటుంది.. స్వరాష్ట్ర ఉద్యమంలో పనిచేసిన సహచరులు కేసీఆర్​ను కలవాలంటే తెలంగాణ కంటే పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తోందని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా మాజీ ఎంపీ అయిన తనకు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వకున్నా అవమానాన్ని దిగమింగానని తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి టికెట్‌ ఇవ్వండని అడగటమే నేరమైతే పార్టీలో ఉంటడం అనవసరమని వ్యాఖ్యానించారు. అభిమానానికి, బానిసత్వానికి తేడా ఉంటుందని.. బడుగు బలహీన వర్గాల సమస్యలను కేసీఆర్ దృష్టికి తెచ్చే అవకాశమే లేనప్పుడు పార్టీలో ఉండటం అర్థరహితమని పేర్కొన్నారు. రాజకీయ వెట్టిచాకిరీని తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని రాజీనామా లేఖలో స్పష్టం చేశారు.

తెరాసను వీడటం బాధించింది..రాజీనామాపై దిల్లీలో మీడియాతో మాట్లాడిన బూర నర్సయ్య గౌడ్‌ .. తెరాసను వీడటం కుటుంబాన్ని వదిలిపెట్టడం కంటే ఎక్కువ బాధించిందని తెలిపారు. పార్టీ నుంచి పంపించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వకుండా అవమానించారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, అనుచరులతో చర్చించిన తర్వాత ఏ పార్టీలో చేరాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటానని బూర నర్సయ్య గౌడ్‌ ప్రకటించారు.

"మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మాజీ ఎంపీ అయినప్పటికీ, ఒక్కసారి కూడా మాతో సంప్రదించలేదు. మునుగోడు టికెట్‌ అసలు నాకు సమస్యనే కాదు. బీసీ సామజిక వర్గానికి టిక్కెట్‌ పరిశీలించండని అడగటం కూడా నేరమే అయితే అసలు ఈ పార్టీలో ఉండటమే అనవసరం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలకు ఆర్థిక, రాజకీయ, విద్య, రంగాల్లో వివక్షకు గురికావడం బాధాకరం. మీరంటే అభిమానం, ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతతో ఇప్పటి వరకు ఉన్నానని, కానీ అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉందని తెలిపారు. వ్యక్తిగతంగా అవమాన పడ్డా, అవకాశాలు రాకున్నా పర్వాలేదు కానీ అట్టడుగు వర్గాల సమస్యలు కనీసం మీ దృష్టికి తీసుకువచ్చే అవకాశమే లేనప్పుడు, తెరాసలో కొనసాగడం అర్థరహితం. రాజకీయ వెట్టి చాకిరీ తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరు. తెరాసతో, మీ కుటుంబ సభ్యులతో రాజకీయ బంధం దూరమైనందుకు చింతిస్తూ, తెరాసకు రాజీనామా చేస్తున్నా..'' అని వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details