తెలంగాణ

telangana

Ganesh Chaturthi 2022 ఈ గణేశ్ నవరాత్రుల్లో మట్టి ప్రతిమలను పూజిద్దాం

By

Published : Aug 30, 2022, 2:07 PM IST

Ganesh Chaturthi 2022
Ganesh Chaturthi 2022

Ganesh Chaturthi 2022 వినాయక ఉత్సవాలకు రాష్ట్రం సిద్ధమవుతోంది. రేపు గణేశ్ చతుర్థి కావడంతో మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంది. మట్టి విగ్రహాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సాయంతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా గణేశ్ ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు.

ఈ గణేశ్ నవరాత్రుల్లో మట్టి ప్రతిమలను పూజిద్దాం

Ganesh Chaturthi 2022 : వినాయకుని మట్టి ప్రతిమలను పూజిద్ధాం.. పర్యావరణం కాపాడుదాం.. అనే నినాదంతో ఈ ఏడాది గణేశ్‌ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జోన్లు, సర్కిళ్లవారీగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సంయుక్త ఆధ్వర్యంలో... స్వచ్ఛంద సంస్థల సహకారంతో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ పెద్ద ఎత్తున సాగుతోంది. రేపు వినాయక చవితి దృష్ట్యా పర్యావరణహిత వినాయక విగ్రహాలు ప్రతిష్టించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున 5 లక్షలకుపైగా బంకమట్టితో తయారు చేసిన ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. 200 ప్రాంతాల్లో సిబ్బందితో, వందకుపైగా సంచార వాహనాల్లో వినాయక విగ్రహాలు అందజేస్తున్నారు.

clay Ganesha idols : ఖైరతాబాద్ గణేషుడు పంచముఖ మహాలక్ష్మీ గణపతి రూపంలో సిద్ధమయ్యాడు. 80 రోజులపాటు 150 మంది కళాకారులు శ్రమించి మట్టితో గణనాధుడిని తయారుచేశారు. రేపు ఉదయం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చేతుల మీదుగా పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారని గణేశ్‌ ఉత్సవ కమిటీ వెల్లడించింది.

"ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు చాలా ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటున్నాడు. పంచముఖ మహాలక్ష్మీ గణపతి రూపంలో గణపయ్యను తయారు చేశాం. వినాయక చవితి సందర్భంగా రేపు ఉదయం గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ఖైరతాబాద్ గణేశుడికి మొదటి పూజ జరుగుతుంది. తర్వాత స్వామి భక్తులకు దర్శనమిస్తారు." - ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ

clay Ganesha idols distribution : మట్టి గణపతిని పూజించి.. ప్రకృతిని కాపాడుకుందామని మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన క్యాంప్ కార్యాలయంలో విత్తన గణపతులను పంపిణీ చేశారు. ఈ విత్తన గణపతిని పూజించిన అనంతరం.. నిమజ్జనం చేసి మొలకెత్తిన మొక్కను నాటి తెలంగాణను హరితమయం చేయాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details