TDP Leaders On Viveka Murder Case: వివేకాను ఎవరు హత్య చేశారో సీబీఐకి తెలుసని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. వివేకా హత్య కేసులో తనను విచారించాలని వైకాపా నాయకులు కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తన ప్రమేయం లేనందునే విచారణకు పిలవలేదని అన్నారు. పూర్తి విషయాలు బహిర్గతమయ్యాక మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారని నిలదీశారు. వివేకా హత్య కేసును అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారిస్తోందని.. సీబీఐ విచారించాక కూడా ఆ నెపాన్ని తెదేపాకు ఆపాదించడమేంటని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు చంద్రబాబుకు ఆపాదించటం సరికాదని హితవు పలికారు. వివేకాను హత్య చేసిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందని అన్నారు.
"వివేకా హత్య కేసును దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోంది. పూర్తి విషయాలు బహిర్గతమయ్యాక మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారు. సీబీఐ విచారించాక కూడా ఆ నెపాన్ని తెదేపాకు ఆపాదించడమేంటి ?. సీబీఐకి వైఎస్ కుటుంబంపై ఏమైనా కక్ష ఉంటుందా ?. వివేకా హత్యను చంద్రబాబుకు చుట్టడం సరికాదు. వివేకాను ఎవరు హత్య చేశారో సీబీఐకి తెలుసు. నా ప్రమేయం లేనందున విచారణకు పిలవలేదు. హత్య చేసిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది." -బీటెక్ రవి, తెదేపా ఎమ్మెల్సీ