ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ మొదటి బ్యాచ్ క్యాడెట్స్ పాసింగ్ఔట్ పరేడ్ హైదరాబాద్ మౌలాలీలో జరిగింది. 7వ బెటాలియన్ ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ అనుబంధ శిక్షణాకేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ తొలిబ్యాచ్ పాసింగ్ఔట్ పరేడ్
ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ మొదటి బ్యాచ్ క్యాడెట్స్ పాసింగ్ఔట్ పరేడ్ హైదరాబాద్ మౌలాలీలోని 7వ బెటాలియన్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ అనుబంధ శిక్షణాకేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా హాజరయ్యారు.
శిక్షణా సమయంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళా క్యాడెట్లను జీఎం ప్రశంసించారు. క్యాడెట్లంతో నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం వారికి మెడల్స్, సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ను అందించారు.
ఆర్పీఎస్ఎఫ్ శిక్షణాకేంద్రాన్ని ఆర్పీఎఫ్ అనుబంధ శిక్షణా కేంద్రంగా మార్చడమే గాక ప్రత్యేకంగా మహిళల బ్యాచ్కు మొదటిసారిగా శిక్షణ ఇచ్చే బాధ్యతను చేపట్టిన వారిని జీఎం గజానన్ అభినందించారు. భారత రైల్వేలోని 14 మండలాలకు చెందిన 298 ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ క్యాడెట్లు విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని క్యాడెట్ల కుటుంబ సభ్యులు ఆన్లైన్లో వీక్షించారు.