తెలంగాణ

telangana

రంజాన్ పండుగకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: మంత్రి తలసాని

By

Published : Mar 28, 2022, 9:56 PM IST

Minister Talasani Review on Ramadan: ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకొనే రంజాన్​కు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. రంజాన్ రోజాల ప్రారంభానికి 4, 5 రోజుల సమయం మాత్రమే ఉన్నందున అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు.

Minister Talasani
Minister Talasani

Minister Talasani Review on Ramadan: ముస్లింలు పవిత్రంగా నిర్వహించుకునే రంజాన్ పండుగకు సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసబ్ ట్యాంక్​లోని తన కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, హార్టికల్చర్, తదితర శాఖల అధికారులు, సనత్​నగర్ నియోజకవర్గ పరిధిలోని మసీదు కమిటీ సభ్యులతో రంజాన్ ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

4, 5 రోజులు మాత్రమే ఉన్నందున...

కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి ముస్లిం సోదరులు రంజాన్‌ను నిర్వహించుకోలేకపోయారని తెలిపారు. ఈ ఏడాది రంజాన్ రోజాలు ఏప్రిల్ 2 లేదా 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని... కేవలం 4, 5 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. నెల రోజుల పాటు జరిగే రోజాల సందర్భంగా వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మసీదు కమిటీ సభ్యుల నుంచి వచ్చే ఫిర్యాదులపై సకాలంలో స్పందించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు.

ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు...

మసీదుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని.. చెత్త, తదితర వ్యర్ధాలను రోజూ తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని శానిటేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మసీదులలో నెల రోజుల పాటు ఇఫ్తార్ విందుల నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. అదేవిధంగా మసీదులకు వెళ్లే అన్ని రహదారులకు అవసరమైన ప్రాంతాలలో మరమ్మతులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు తెలిపారు. మసీదులకు నీటి సరఫరా, విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. పలు మసీదు కమిటీల సభ్యులు వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు రాగా.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు కొలను లక్ష్మి బాల్​రెడ్డి, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, నామన శేషుకుమారి, ఆకుల రూప, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, మసీదు కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:TS EAMCT 2022: ఎంసెట్, ఈసెట్‌ నోటిఫికేషన్లు విడుదల

ABOUT THE AUTHOR

...view details