తెలంగాణ

telangana

అటవీశాఖ సిబ్బంది పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఆరా​

By

Published : Apr 22, 2021, 3:39 PM IST

ఎలాంటి అజాగ్రత్తలకు చోటివ్వకుండా కరోనా మార్గదర్శకాలను పాటించాలని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్షని స్పష్టం చేశారు. అటవీ శాఖ సిబ్బంది ఆరోగ్య స్థితిపై పీసీసీఎఫ్ శోభను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

indrakaran reddy
మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. ప్రస్తుతం స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. అటవీ శాఖలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తాజా పరిస్థితిపై ఆరా తీశారు. కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడంపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్​.శోభ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అజాగ్రత్తలకు చోటివ్వకుండా కరోనా నియమాలను పాటించాలని సూచించారు.

మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి సూచనల మేరకు అరణ్య భవన్​లో ప్రత్యేకంగా కొవిడ్​ వాక్సినేషన్ సెంటర్​ను ప్రారంభించినట్లు పీసీసీఎఫ్ వెల్లడించారు. ప్రతీ ఉద్యోగి వాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యారోగ్య శాఖ సమన్వయంతో.. అన్ని జిల్లాల్లో క్షేత్ర స్థాయి సిబ్బందికి వాక్సిన్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

అరణ్య భవన్​లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్​ కేంద్రంలో టీకా పంపిణీని స్వయంగా పర్యవేక్షించారు. హైదరాబాద్ చీఫ్​ కన్జర్వేటర్​ ఎంజే అక్బర్, డీఎఫ్ఓ జోజి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఇవీచూడండి:'నేలతల్లి బాగుంటేనే.. భావితరాలకు మంచి భవిష్యత్'

ABOUT THE AUTHOR

...view details