తెలంగాణ

telangana

అనుమానాల్లేవ్..త్వరలోనే మూడు రాజధానులు: ఏపీ మంత్రి బొత్స

By

Published : Feb 25, 2021, 10:51 PM IST

మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ అంశంపై న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని.. న్యాయ వివాదం పరిష్కారం కాగానే ఏ నిమిషంలోనైనా సరే విశాఖలో కార్యనిర్వహణ రాజధాని ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామన్నారు.

అనుమానాల్లేవ్..త్వరలోనే మూడు రాజధానులు: ఏపీ మంత్రి బొత్స
అనుమానాల్లేవ్..త్వరలోనే మూడు రాజధానులు: ఏపీ మంత్రి బొత్స

త్వరలోనే మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతుందని.. ఎవరూ అనుమానపడాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఈ అంశంపై న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని.. వివాదం పరిష్కారం కాగానే విశాఖలో కార్యనిర్వహణ రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతిలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామన్నారు.

అమరావతి అభివృద్దిపై సీఎం జగన్​కు చిత్తశుద్ధి ఉందన్నారు. అమరావతిలో అవసరమైన మేరకు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు. దీనికోసం రూ.3 వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పుతెచ్చి అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు.

అనుమానాల్లేవ్..త్వరలోనే మూడు రాజధానులు: ఏపీ మంత్రి బొత్స

ఇదీ చదవండి: 'నిజంగా లక్ష ఉద్యోగాలిస్తే మెడలో బోర్డు వేసుకుని తిరిగెటోళ్లు'

ABOUT THE AUTHOR

...view details