తెలంగాణ

telangana

ప్రజల్లో కరోనా భయం... నిర్మానుష్యంగా భాగ్యనగరం

By

Published : Mar 17, 2020, 7:19 PM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్​ ప్రభావం తెలంగాణనూ భయపెడుతోంది. అప్రమత్తమైన సర్కార్​ ముందస్తు చర్యలు చేపట్టింది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం, ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం, థియేటర్లు, పార్కుల మూసివేతతో హైదరాబాద్​ మహానగరంలో రద్దీ తగ్గింది. నిత్యం జనంతో కళకళలాడే పలు ప్రాంతాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి.

hyderabad roads empty due to corona effect
ప్రజల్లో కరోనా భయం... నిర్మానుష్యంగా మారిన భాగ్యనగరం

ప్రజల్లో కరోనా భయం... నిర్మానుష్యంగా మారిన భాగ్యనగరం

కరోనా వైరస్​... ఈ పేరు చెబితే చాలు.. ప్రజలంతా వణికిపోతున్నారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తోన్న ఈ వైరస్​పై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే నాలుగు కరోనా పాజిటివ్​ కేసులు నమోదైన నేపథ్యంలో సర్కార్​ అప్రమత్త చర్యలు తీసుకుంటోంది. ముందస్తుగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేయాలని ఆదేశించింది.

బోసిపోయిన భాగ్యనగరం

కొవిడ్-19 వైరస్​ ప్రభావం భాగ్యనగరంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నిత్యం జనంతో సందడిగా ఉండే నగరంలోని పలు ప్రాంతాలు బోసిపోయాయి. ఎప్పుడు రద్దీగా ఉండే హోటళ్లు, రెస్టారెంట్లు కస్టమర్లు లేక వెలవెలబోయాయి. కరోనా వైరస్​ భయంతో బయట ఫుడ్​ తినాలనిపిస్తే ఆన్​లైన్​లో ఆర్డర్​ చేసుకుంటున్నారు కానీ.. బయట అడుగుపెట్టడం లేదు.

నిర్మానుష్యంగా నగర రహదారులు

పాఠశాలలు, కళాశాలలు, ఆఫీసులు, షాపింగ్​, థియేటర్లకు వెళ్లే జనంతో ఎప్పుడు కిటకిటలాడే భాగ్యనగర రహదారులు ఇప్పుడు ఖాళీగా బిక్కుబిక్కుమంటున్నాయి. కొవిడ్-19 వైరస్​ నేపథ్యంలో నగరమంతా నిర్మానుష్యంగా మారింది. సాయంత్రం కాగానే జనంతో కిటకిటలాడే పర్యటక ప్రాంతాలు.. ఇప్పుడు జనాలు లేక వెలవెలబోతున్నాయి. ఓ విధంగా అప్రకటిత కర్ఫ్యూ కనిపిస్తోంది.

అప్రమత్తమయినా.. ఆందోళన వీడట్లేదు

ఇప్పటికే అప్రమత్తమైన తెలంగాణ సర్కార్​ కరోనా వ్యాప్తి నివారణకు అనేక చర్యలు చేపట్టింది. ప్రజల్లో భయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నా... వరుసగా పాజిటివ్​ కేసులు నమోదవుతుండటం వల్ల ఆందోళనకు గురై బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details