1. ఆద్యంతం ఉత్కంఠ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాల పాత్ర కీలకం. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో ప్రజల చూపు ఈ స్వింగ్ స్టేట్స్పై పడింది. మరి అధ్యక్ష పదవి చేపట్టడంలో కీలకంగా మారిన ఈ రాష్ట్రాల్లో గెలుపెవరిది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మూడు నెలలు అత్యంత కీలకం
కరోనా నియంత్రణలో వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు జి.శ్రీనివాస రావు అన్నారు. ప్రభుత్వ చర్యలతో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలో 44 లక్షలకుపైగా పరీక్షలు జరిగితే.. మరణాల రేటు 0.55 శాతమే ఉందన్నారు. పండుగల సీజన్తో పాటు చలికాలం కావడం వల్ల వైరస్ మళ్లీ విజృంభించకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్రభుత్వంపై పోరు
సన్నరకం ధాన్యాన్ని రెండున్నర వేల మద్దతు ధరకు కొనుగోలు చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం నల్గొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఏపీలో కేసులెన్నంటే?
ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 75 వేల 465 నమూనాల ఫలితాలు రాగా 2వేల 477 మంది కరోనా బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 33 వేల 208కి చేరినట్లు తెలిపింది. వైరస్తో మరో 10 మంది మృత్యువాతపడగా.. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 6 వేల 744కు పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పినాక విజయవంతం
అత్యాధునిక పినాక రాకెట్లను విజయవంతంగా పరీక్షించింది డీఆర్డీఓ. ఒడిశా చందిపుర్లోని టెస్ట్ రేంజ్ నుంచి 6 రాకెట్లు ప్రయోగించగా.. అన్ని లక్ష్యాలను చేరుకున్నాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.