1. రేపటి నుంచి కొత్త రెవెన్యూ చట్టం
రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం రేపటి నుంచి అమల్లోకి రానుంది. భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం-2020 అమలు తేదీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 29 నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. బంధువే... కిడ్నాపర్
రాష్ట్ర రాజధానిలో దంత వైద్యుడి అపహరణ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. బాధితుడిని బెంగళూరుకు తరలిస్తుండగా ఏపీలోని అనంతపురం జిల్లాలో పట్టుకొని... సైబరాబాద్ పోలీసులకు అప్పగించారు. కిడ్నాప్ సూత్రధారి ముస్తఫా... వైద్యుడు హుస్సేన్కు దగ్గరి బంధువేనని సీపీ సజ్జనార్ తెలిపారు. విలాస జీవితానికి అలవాటు పడి డబ్బు కోసం అపహరించాడని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. దోషికి ఉరి శిక్ష ఖరారు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ గొర్రెకుంట మృత్యుబావి కేసులో దోషికి ఉరిశిక్ష పడింది. సంజయ్కుమార్కు ఉరిశిక్ష విధించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. తప్పు చేసిన వాడికి శిక్ష ఖాయమన్నది.. వరంగల్ న్యాయస్ధానం మరోసారి నిరూపించిందని న్యాయవాదులు అంటున్నారు. తమ దర్యాప్తునకు గుర్తింపుగా వచ్చిన తీర్పుగా పోలీసులు అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఆటవిక రాజ్యానికి రాకుమారుడు
బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై ప్రధాని నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. ఆటవిక రాజ్యానికి యువరాజు అంటూ తేజస్వీపై నిప్పులు చెరిగారు. 10 లక్షల ఉద్యోగాల హామీని ఎగతాళి చేశారు. లాలూ హయాంలో బిహార్ను రోగగ్రస్థ రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సీఎంపై సీబీఐ దర్యాప్తు
అవినీతి ఆరోపణలతో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి ఆ రాష్ట్ర హైకోర్టు. దీంతో ముఖ్యమంత్రి పదవికి రావత్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.