తెలంగాణ

telangana

టాప్​టెన్ న్యూస్ @9PM

By

Published : Mar 15, 2021, 8:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్​టెన్ న్యూస్ @9PM

1. 'పసుపు బోర్డు ప్రతిపాదన లేదు'

తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. పది రోజులపాటు సమావేశాలు

బడ్జెట్ సమావేశాలు పది రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 26 వరకు శాసనసభను సమావేశపరచాలని నిర్ణయించారు. ఈనెల 18న బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా రెండు రోజుల పాటు బడ్జెట్‌పై సాధారణ చర్చ... మూడు రోజుల పాటు పద్దులపై చర్చ చేపడతారు. 26 వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ఉంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'ఆదర్శంగా నిలిచాం'

అన్నివర్గాల ప్రజల పురోగతికి కట్టుబడి ఉన్నామని... రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ తమిళిసై... ముఖ్యమంత్రి కేసీఆర్​ సారథ్యంలో వినూత్న పథకాలతో అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. కేసీఆర్​కు ఆహ్వానం

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ప్రగతిభవన్‌లో సీఎంను ఆలయ అధికారులు, ఆలేరు ఎమ్మెల్యే, విప్‌ గొంగిడి సునీత మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. సోదాలు..ముగ్గురు అరెస్ట్​

దిల్లీ, కర్ణాటక, కేరళలోని 11 ప్రాంతాల్లో ఎన్​ఐఏ తనిఖీలు చేపట్టింది. పాక్​, ఐసిస్​ ముఠాలతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న ముగ్గురిని అరెస్ట్​ చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. టీకా పంపిణీ 3 కోట్ల+

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సరికొత్త తీరాలకు చేరింది. సోమవారం నాటికి 3 కోట్లకు పైగా టీకా డోసులను అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు.. ప్రజలు నిబంధనలు పాటించకపోవటమే కేసుల పెరుగుదలకు కారణమన్నారు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఆ కేసులో ఉరిశిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 'బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్'​ కేసులో దోషిగా తేలిన అరిజ్​ ఖాన్​కు ఉరిశిక్ష విధించింది దిల్లీ కోర్టు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా అభివర్ణించింది. ఉరిశిక్షతో పాటు మొత్తం రూ.11 లక్షల జరిమానా విధించింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. మయన్మార్​లో మార్షల్​ చట్టం

మయన్మార్​లో అతిపెద్ద నగరమైన యాంగూన్​లోని ఆరు ప్రాంతాల్లో మార్షల్​ చట్టాన్ని అమలు చేసింది సైన్యం. నార్త్​ డగూన్​, సౌత్​ డగూన్​, డగూన్​ సైకన్​, నార్త్​ ఒక్కలప, లైయింగ్​ థార్​ యార్​, శ్వేపైత ప్రాంతాల్లో ఈ మార్షల్​ చట్టాన్ని సైన్యం ప్రయోగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. మూడో టీ20 సాధించేదెవరు?

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా భారత్​-ఇంగ్లాండ్​ మధ్య మంగళవారం మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్​ల్లో చెరొకటి గెలిచి సిరీస్​ సమం చేయగా.. మూడో టీ20లో గెలుపొంది సిరీస్​ ఆధిక్యంలో కొనసాగాలని ఇరుజట్లు సన్నద్ధమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఆస్కార్ నామినేషన్స్ ప్రకటన

93వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్​ ప్రకటించారు. ఇందులో భారతీయ చిత్రం 'సూరరై పోట్రు' చోటు దక్కించుకోలేకపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details