తెలంగాణ

telangana

రాచకొండ కమిషనరేట్​ హెడ్​క్వార్టర్స్​లో క్యాంటీన్ ప్రారంభం

By

Published : Jun 24, 2021, 12:17 PM IST

రాచకొండ కమిషనరేట్​ హెడ్​ క్వార్టర్స్​లో పోలీసు సిబ్బంది కోసం క్యాంటీన్, వాలీబాల్ కోర్టు, షటిల్ కోర్టులను ఏర్పాటు చేశారు. వీటిని సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు.

Rachakonda Commissionerate, Rachakonda CP Mahesh Bhagwat
రాచకొండ కమిషనరేట్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్

హైదరాబాద్​ అంబర్​పేట్​ పరిధిలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్​ హెడ్​ క్వార్టర్స్​లో పోలీసు సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్, వాలీబాల్ కోర్టు, మహిళా పోలీసుల కోసం షటిల్​ కోర్టును సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. హెడ్​ క్వార్టర్స్​లో దాదాపు 1000 మంది సిబ్బంది సేవలందిస్తుంటారని సీపీ తెలిపారు. వారికి ఇబ్బంది కలగకూడదని క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసు సిబ్బంది దృఢంగా ఉండటం కోసం వాలీబాల్, షటిల్ కోర్టులు నిర్మించినట్లు వెల్లడించారు.

రాచకొండ కమిషనరేట్​ హెడ్​క్వార్టర్స్

క్యాంటీన్​లో అందజేసే ఆహారం నాణ్యతతో కూడి ఉండేలా చర్యలు తీసుకున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. డిజాస్టర్ మేనేజ్​మెంట్ కోసం టాటా ఏరోస్పేస్ సహకారంతో బోట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కమిషనరేట్​లో పోలీసు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిరకాల వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

రాచకొండ కమిషనరేట్​ హెడ్​క్వార్టర్స్

ABOUT THE AUTHOR

...view details