తెలంగాణ

telangana

సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరిగాయ్- ఎంతంటే?

By PTI

Published : Dec 29, 2023, 5:39 PM IST

Updated : Dec 29, 2023, 6:59 PM IST

Sukanya Samriddhi Yojana Interest Rate Hike : సుకన్య సమృద్ధి యోజన కింద చేసే డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచింది కేంద్రం. 20 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Sukanya Samriddhi Yojana Interest Rate Hike
Sukanya Samriddhi Yojana Interest Rate Hike

Sukanya Samriddhi Yojana Interest Rate Hike :సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది. ఈ పథకం కింద చేసే డిపాజిట్లకు 20 బేసిస్ పాయింట్లు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లకు 10 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇతర చిన్న మొత్తాల సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ఈ మేరకు జనవరి-మార్చి కాలానికి వర్తించే వడ్డీ రేట్లపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సుకన్య సమృద్ధి స్కీమ్ కింద డిపాజిట్లకు ఇప్పటివరకు 8 శాతం వడ్డీ లభిస్తుండగా ఇకపై 8.20 శాతం చెల్లించనున్నారు. మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై ప్రస్తుతం వడ్డీ రేటు 7 శాతం ఉండగా దాన్ని 7.1 శాతానికి పెంచారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్- పీపీఎఫ్, సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం పీపీఎఫ్​లకు 7.1 శాతం, సేవింగ్స్ డిపాజిట్లకు 4శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.

  • కిసాన్ వికాస్ పత్ర(కేవీపీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్​పై వడ్డీ రేట్లలో మార్పు లేదు.
  • కేవీపీ వడ్డీ రేటు 7.5 శాతం ఉండగా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్​పై 7.7 శాతం వడ్డీ లభించనుంది.
  • మంథ్లీ ఇన్​కమ్ స్కీమ్​పై యథాతథంగా 7.4 శాతం వడ్డీ కొనసాగనుంది.

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది. 2022 మే నుంచి కీలక వడ్డీ రేట్లను 2.5 శాతం మేర పెంచింది ఆర్​బీఐ. ఈ నేపథ్యంలో బ్యాంకులు సైతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాల్సి వచ్చింది. అయితే, 2023 ఫిబ్రవరి నుంచి జరిగిన పాలసీ రేట్లలో ఆర్​బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు.

వడ్డీ రేట్లు పెంచిన బీఓబీ
మరోవైపు, ఫిక్స్​డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ). వివిధ మెచ్యూరిటీ పీరియడ్లు కలిగిన డిపాజిట్లపై 125 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ పెంచుతున్నట్లు తెలిపింది. వారం నుంచి 17 రోజుల కాల వ్యవధి ఉన్న రూ.2కోట్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీని 125 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఈ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేటు ప్రస్తుతం ఉన్న 3 శాతం నుంచి 4.25 శాతానికి పెరిగింది. 15-45 రోజుల టర్మ్ డిపాజిట్లకు వడ్డీ 100 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఈ డిపాజిట్ల వడ్డీ రేటు 4.50 శాతానికి చేరింది. షార్ట్ టర్మ్ డిపాజిట్లపైనే ప్రధానంగా వడ్డీ పెంచినట్లు బీఓబీ తెలిపింది.

Sukanya Samriddhi Yojana : సుకన్య సమృద్ధి యోజనతో 'ఆమె' భవిష్యత్ బంగారం.. రూ.300తో రూ.50 లక్షల మెచ్యూరిటీ!

Best Central Government Schemes For Girls: ఆడపిల్లల కోసం.. 5 బెస్ట్ ప్రభుత్వ పథకాలు!

Last Updated :Dec 29, 2023, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details