తెలంగాణ

telangana

ఆసియా కుబేరుల జాబితాలో బ్రిటన్ ప్రధాని సునాక్‌, అక్షత.. తొలిసారిగా..

By

Published : Nov 25, 2022, 6:58 AM IST

sunak

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతా మూర్తి తొలిసారిగా యూకేకు చెందిన 'ఏషియన్‌ రిచ్‌ లిస్ట్‌ 2022'లో చోటు దక్కించుకున్నారు.

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌, ఆయన భార్య అక్షతా మూర్తి తొలిసారిగా యూకేకు చెందిన "ఏషియన్‌ రిచ్‌ లిస్ట్‌ 2022"లో చోటు చేసుకున్నారు. 790 మిలియన్‌ పౌండ్ల (దాదాపు రూ.7,700 కోట్ల) సంపదతో సునాక్‌, అక్షత ఈ జాబితాలో 17వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ఏడాది జాబితాలోని వారి మొత్తం సంపద 113.2 బిలియన్‌ పౌండ్లుగా నమోదైంది. 2021తో పోలిస్తే ఇది 13.5 బి. పౌండ్లు అధికం. వరుసగా ఎనిమిదో ఏడాదీ హిందుజా కుటుంబం 30.5 బిలియన్‌ పౌండ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

2021తో పోలిస్తే 3 బిలియన్‌ పౌండ్లను అదనంగా హిందూజా కుటుంబం జత చేసుకుంది. ఇక్కడ జరిగిన 24వ వార్షిక ఏషియన్‌ బిజినెస్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో హిందుజా గ్రూప్‌ సహ ఛైర్మన్‌, గోపీచంద్‌ హిందుజా కుమార్తె రితు చాబ్రియాకు లండన్‌ మేయర్‌ సాదిఖ్‌ ఖాన్‌ ఈ "ఏషియన్‌ రిచ్‌ లిస్ట్‌ 2022" ప్రతిని అందజేశారు. బ్రిటన్‌లో ఆసియా సంతతి ఏటా వృద్ధి చెందుతోందనడానికి ఈ జాబితా నిదర్శనమని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
జాబితాలో లక్ష్మీ మిత్తల్‌, ఆయన కుమారుడు ఆదిత్య (12.8 బి.పౌండ్లు); నిర్మలా సేథియా (6.5 బి.డాలర్లు) తదితరులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details