తెలంగాణ

telangana

ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?

By

Published : Oct 14, 2022, 12:22 PM IST

Updated : Oct 14, 2022, 12:35 PM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today In Hyderabad and Vijayawada
Gold Rate Today In Hyderabad and Vijayawada

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.50 పెరిగి ప్రస్తుతం రూ.52,320గా ఉంది. కేజీ వెండి ధర రూ.340 పెరిగి.. రూ.58,340 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,320గా ఉంది. కిలో వెండి ధర రూ.58,340 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,320 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,340గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,320గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,340 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,320 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.58,340 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,671 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.05 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,70,424 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.15,70,424
ఇథీరియం రూ.1,05,999
టెథర్​ రూ.82.25
బినాన్స్​ కాయిన్​ రూ.22,107
యూఎస్​డీ కాయిన్ రూ.82.66

స్టాక్​ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్చేంజ్ సూచీ​ సెన్సెక్స్‌ 910 పాయింట్ల లాభంతో 58,145 వద్ద ట్రేడవుతోంది. ఈ సూచీ ఓ దశలో 1,000 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 245 పాయింట్లు లాభపడి 17,261 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న జాబితాలో ఉన్నాయి.

రూపాయి:అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభంలో 3 పైసలు లాభపడి.. ప్రస్తుతం 82.31కు చేరింది.

Last Updated : Oct 14, 2022, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details